గుడిహత్నూర్ : మండలంలోని మన్నూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం షార్ట్సర్క్యూట్తో కారు దగ్ధమయ్యింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు (స్కార్పియో) మన్నూర్ సమీపంలో ఆకస్మికంగా ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడంతో కారును పక్కకు ఆపారు. కారులోని 5గురు కారు నుంచి దిగగానే ఒక్కసారిగా మంటలు ఎగిసి కారు పూర్తిగా దగ్ధమయ్యింది.
సమాచారం తెలుసుకున్న ఇచ్చోడ అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ప్రమాద సమయంలో వాహనంలో ఐదుగురు ఉన్నారని ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎస్ఐ ఎల్ ప్రవీణ్ తెలిపారు.