అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా కశింకోట మండలం ఎన్జీపాలెంలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు వెంట నడిచి వెళ్తున్న మహిళను ఢీకొట్టి డివైడర్ ఎక్కి అవతలి వైపునకు దూసుకెళ్లింది. గాయపడిన మహిళను స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
కారును పట్టుకునేందుకు ఓ వ్యక్తి యత్నించిగా దుండగులు కత్తితో బెదిరించి ఎలమంచిలి వైపు పరారయ్యారు. సమాచారం అందుకున్న కశింకోట పోలీసులు సినీ ఫక్కీలో కారును వెంబడించి పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి మూటలు ఉండటంతో షాక్కు గురయ్యారు. దుండగులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.