కోహీర్/సంగారెడ్డి : జిల్లాలోని కోహీర్ మండలం సిద్ధాపూర్ తండా సమీపంలో చెరుకు తోటలో అక్రమంగా పెంచుతున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. సిద్ధాపూర్ తండా సమీపంలో చెరుకు తోటలో అక్రమంగా గంజాయి పెంచుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు.. దాడులు చేశామని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న వారి కోసం గాలిస్తున్నామని, వారు పరారీలో ఉన్నారన్నారు. ఎవరైనా గంజాయిని పెంచినా విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.