సికింద్రాబాద్ : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ ఎంన్ రెడ్డికాలనీకి చెందిన జాదవ్ శివకుమార్ అలియాస్ పవార్ శివకుమార్ (21) ఈనెల 28 న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జేబీఎస్ నుంచి తన బంధువును తీసుకు రావడానికి టీఎస్16 ఈవై 4253 నెంబరుగల తన బైకుపై ఇంటినుంచి బయలుదేరాడు.
తవాయిపురాలోని శివాలయం క్రాసింగ్ వద్దకు చేరుకోగానే రాంగ్రూట్లో వచ్చిన టీఎస్34 ఎఫ్డీ 0184 నెంబరుగల బైకు అదుపుతప్పి శివకుమార్ బైకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయిన శివకుమార్కు తీవ్రగాయాలవ్వ డంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
బాధితుడి భార్య జాదవ్ ప్రియాంకా ఫిర్యాదుమేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.