పుణే : మహారాష్ట్రలో దారుణం జరిగింది. నాలుగేండ్ల పసిపాపకు చాక్లెట్ ఆశచూపి 12 ఏండ్ల బాలుడు లైంగికంగా వేధించిన ఘటన పుణే జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం పింప్రి చించ్వాడ్లో నాలుగేండ్ల బాలిక ఆడుకునేందుకు పొరుగింటికి వెళ్లగా చాక్లెట్ కొనుక్కునేందుకు డబ్బు ఇస్తానని బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లి కంటపడగా కూతురును కాపాడి ఇంటికి తీసుకుకవచ్చింది. బాలిక కుటుంబసభ్యులు బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.