హైదరాబాద్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు రాంగ్రూట్లో వచ్చి ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఆ ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న ఫోర్ వీలర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు గాల్లో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాద ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్లోని నాగర్గూడ బస్టాప్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గాయపడ్డ యువకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.