హైదరాబాద్ : నో ఎంట్రీ నిబంధనను విస్మరించి పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే లోకి ప్రవేశించిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారం వ్యవధిలో ఇది రెండవ సంఘటనగా పేర్కొన్నారు. క్షతగాత్రుడిని ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. 20 ఏళ్ల యువకుడు ఆరాంఘర్ నుండి మెహదీపట్నం వైపు బైక్పై వెళ్తున్నాడు. ఈ మార్గం మధ్యలో అదుపుతప్పి బైక్పై నుండి కింద పడ్డాడు.
దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు లేని సమయంలో ద్విచక్ర వాహనదారులు షార్ట్కట్ మార్గంగా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.