నిజాంపేట/మెదక్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బైక్, ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన నిజాంపేట గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రకాశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని హాబీబ్నగర్కు చెందిన సయ్యద్ జానీ (18) ఆటో నడుపుతూ సిద్దిపేట నుంచి నిజాంపేట వైపు వెళ్తున్నాడు.
శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామానికి చెందిన మహేశ్వర్గౌడ్, సయ్యద్ రఫీక్ నిజాంపేట నుంచి సిద్దిపేట వైపు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో నిజాంపేట గ్రామ శివారులోని శ్రీ చక్ర ఫౌల్ట్రీ ధర్మకాంట వద్దకు రాగానే ఆటో నడుపుతున్న సయ్యద్ జానీ రాంగ్ రూట్లో వెళ్లి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా..తీవ్రగాయాల పాలైన సయ్యద్ జానీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రకాశ్గౌడ్ తెలిపారు.