చిట్యాల : మండలంలోని బావుసింగ్పల్లి గ్రామానికి చెందిన గొడుగు కుమార్ (30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం నైన్పాక గ్రామ నుంచి వలస వచ్చిన కుమార్ భావుసింగ్పల్లిలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానకు తరలించగా బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతిడికి భార్య స్వరూప, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.