భారతదేశానికి పక్క దేశాల నుంచి వచ్చే అక్రమ వలసదారులకు సహాయం చేస్తున్న గ్యాంగ్ గుట్టు రట్టయింది. ఈ గ్యాంగ్ సభ్యులు అక్రమ మార్గాల్లో వలసదారులకు ఆధార్ కార్డులు అందిస్తున్నారు. ఈ వలసదారులు ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్నట్లు సమాచారం. వీరికి ఆదార్తోపాటు ఇతర పౌరగుర్తింపు కార్డులను కూడా బెంగళూరుకు చెందిన ఈ ముఠా సభ్యులు అందిస్తున్నారట.
ఇలా అక్రమంగా కార్డులు ఇచ్చినందుకు రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేసేవారని బెంగళూరు పోలీసులు తెలిపారు. మొత్తం ఈ ముఠాలో 9 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఈ ముఠా దగ్గరి నుంచి 31 ఆధార్ కార్డులు, 13 పాన్ కార్డులు, 28 ఓటర్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.