కోల్కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ యువ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ యువ మోర్చా నాయకుడిగా పని చేస్తున్న మిథున్ ఘోష్ (37)ను దుండగులు తన ఇంట్లోనే కాల్చి చంపారు. ఉత్తర దీనజ్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మిథున్ ఘోష్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉన్నదని పోలీసులు చెప్పారు. ఇదిలావుంటే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలే తమ నాయకుడిని కాల్చిచంపారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.