న్యూఢిల్లీ : తనకు అమ్మాయి పుట్టిందనే కోపంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. రెండు నెలల పసికందును మైక్రోఓవెన్లో పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని చిరాగ్ దిల్లీ ఏరియాలో సోమవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంపతులకు నాలుగేండ్ల కుమారుడు ఉన్నాడు. రెండు నెలల క్రితం వీరికి పాప జన్మించింది. అమ్మాయి పుట్టడం డింపుల్కు నచ్చలేదు. ఆ రోజు నుంచే చిన్నారిని తల్లి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో ఆ బిడ్డను మైక్రోఓవెన్లో పెట్టి చంపేసింది.
అయితే పసిపాపను మైక్రోఓవెన్లో పెట్టిన దృశ్యాలను చిన్నారి నానమ్మ చూసింది. దీంతో ఆమె గట్టిగా అరిచేసరికి.. డింపుల్ లోపలి నుంచి డోర్ లాక్ చేసింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపుబద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా, డింపుల్, నాలుగేండ్ల కుమారుడు మాత్రమే ఉన్నారు. మైక్రోఓవెన్లో ఉన్న శిశువును పరిశీలించగా, పాప చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.