అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం..శుభం తెలియని చిన్నారని దారుణంగా హత్యచేసి చెట్టుకు వేలాడదీసిన భయాందోళనకర సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కలికిరి మండలం అద్దవారిపల్లె గ్రామంలో నివాసముంటున్న ఏడు సంవత్సరాల ఉదయ్ కుమార్ను గుర్తు తెలియని వ్యక్తులు చంపి సమీపంలోని చెట్టుకు ఉరివేశారు.
ఇవాళ గమనించిన స్థానికులు ఆ దృశ్యాన్ని చూసి అవాక్కయి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలను ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడి హత్య గ్రామంలో విషాదం నింపింది.