కాచిగూడ,ఆగస్టు 16 : ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనం మాయమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. డీఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక డివిజన్ తిలక్నగర్లోని సుందర్నగర్ ప్రాంతానికి చెందిన రవి కుమార్తె అంబటి రుక్మిణి(34) వృత్తిరీత్యా ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది.
ఈ నెల 12న తన ఇంటి ముందు (టీఎస్ 11 ఈసీ 1669) ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేసి ఇంట్లోకి వెళ్లి మరుసరి రోజు చూసేసరికి ద్విచక్రవాహనం కనబడలేదు. చుట్టు పక్కల, ఇతర ప్రాంతాల్లో వెతికినా ఆచూకి లభించలేదు. సోమవారం రుక్మిణి కాచిగూడ పోలీస్స్టేషన్లో పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.