నల్లగొండ : జిల్లాలోని పెద్దవూర మండలం ఏనమీది తండాలో విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (VRO) స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై లైంగిక దాడు కేసులో జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.
నిందితుడు రమావత్ హరీష్ నాయక్, నిర్వాహకుడు శ్రీనివాస్ రావు ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్దారించింది. ఏ-1 నిందితుడు రమావత్ హరీష్ నాయక్కు యావజ్జీవ కారాగార శిక్ష, 10వేల రూపాయల జరిమానా విధించింది.
ఏ-2 నిందితుడు సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్ రావుకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా, ఏ-3 నిందితురాలు సరితకు 6నెలల జైలు శిక్ష, జరిమానాను మొదటి అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు జడ్జి నాగరాజు తీర్పు వెలువరించారు. 2014లో చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.