తెలుగుయూనివర్సిటీ : నిర్లక్ష్యంగా పట్టాల మధ్యనుండి నడుచుకుంటు వెళ్తున్న ఓ యువతిని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
నాంపల్లి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ పి. నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం..హైటెక్ సిటీ-బోరబండ రైల్వే స్టేషన్ల మధ్య అప్లైన్లో పట్టాల మధ్య సుమారు 20-25సంవత్సరాల యువతి నడుచుకుంటూ వెళుతోంది. అదే సమయంలో వస్తున్నముంబాయి ఎక్స్ప్రెస్ రైలును గమనించక పోవడంతో యువతిని రైలు ఢీకొట్టింది.
దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా దవఖాన మార్చురీకి తరలించారు. సంబంధీకులు వివరాలకు 040-23202238, 9000394635నెంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.