కాచిగూడ : రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి (35 ) ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ సత్యనారాయణరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి యశ్వంత్పూర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కారణాలు తెలియరాలేదు.
శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి మార్చురీలో ఉంచారు. అతని ఒంటిపై నీలిరంగు టీ షర్ట్ , బ్రౌన్కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.