యాచారం : మోటర్ సైకిల్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా మోటర్ సైకిల్ బలంగా ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే పోలీసులు అతనిని మాల్లోని ఓ ప్రైవేటు దవాఖానలో ప్రాథమిక చికిత్స నిర్వహించి, అనంతరం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
ఉస్మానియాలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. బైకుపై ఉన్న వ్యక్తి కింద పడటంతో అతనికి గాయాలయ్యాయి. గుర్తు తెలియని మృతుడి ఆచూకి తెలిసినవారు 9490617313, 9490617242, 9491039119 నంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.