శంషాబాద్ రూరల్: ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన అయిల్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటన బుధవారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామం వద్ద ఇనుప రాండ్లతో వెళ్తున్న లారీని రోడ్డు పక్కన ఆపుకున్న డ్రైవర్ డిజీల్ చేక్ చేస్తుండగా శంషాబాద్ వైపు నుంచి షాద్నగర్ వైపు వెళ్తున్న అయిల్ ట్యాంకర్ ఢీకొవడంతో డిజీల్ చెక్ చేస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్ఠం నిమిత్తం నగరంలోని ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రకాష్ రెడ్డి తెలిపారు.