పరిగి టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… తొండపల్లి గ్రామానికి చెందిన ఇదిగాని యాదయ్యకు ఆరోగ్యం బాగలేకపోవడంతో అదే గ్రామానికి చెందిన గురంపల్లి రాజు, కావలి సుభాన్ ద్విచక్రవాహనంపై పరిగి దవాఖానకు వచ్చి తిరుగు ప్రయాణంలో చిట్యాల్-తొండపల్లి గ్రామశివార్లలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న గురంపల్లి రాజు, కావలి సుభాన్ అక్కడికక్కడే మృతి చెందగా యాదయ్యకు తీవ్ర గాయలయ్యాయి. మృతుడు గురంపల్లి రాజు భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి పరిగి సర్కారు దవాఖానకు వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామార్శించి రూ. 10వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మార్కేట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ కుమార్రెడ్డి ఉన్నారు.