నల్లగొండ : జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లిలో హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అక్కంపల్లి రిజర్వాయర్లో మహేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. హోలీ ఆడిన అనంతరం స్నేహితులతో కలిసి అక్కంపల్లి రిజర్వాయర్కు స్నానానికి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. గల్లంతైన మహేశ్ కోసం గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలిస్తున్నారు. మహేశ్ నాంపల్లి మండలం చేపూరు వాసి అని పోలీసులు నిర్ధారించారు.