హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని బాచుపల్లిలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఎలక్ట్రిక్ బైక్ను ఢీకొట్టింది. బైక్పై వెళ్తున్న ఓ 24 ఏండ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని దుండిగల్ పరిధిలోని మల్లన్పేటకు చెందిన ఎం అజయ్గా పోలీసులు గుర్తించారు.
అజయ్ బాచుపల్లి నుంచి మల్లన్పేట్ వైపు వెళ్తుండగా, ఐడీఏ బొల్లారం క్రాస్ రోడ్స్ వద్ద ఢీకొట్టింది. దీంతో అజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.