కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడిలో దారుణం జరిగింది. ఓ యువకుడిని, అతని తల్లిని జగిత్యాలకు చెందిన వ్యక్తులు కత్తితో విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. ప్రేమ వ్యవహారం వల్లనే యువతి బంధువులు దాడి చేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లీకుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.