Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విషాదం నెలకొంది. సికింద్రాబాద్ పరిధిలోని బన్సీలాల్పేటలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను 8వ అంతస్తు నుంచి కిందకు తోసేసింది. అనంతరం తాను కూడా అదే బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని సౌందర్యగా గుర్తించారు. ఇద్దరు కవల పిల్లలను బిల్డింగ్ పైనుంచి తోసేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలు, అదనపు కట్నం కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.