హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు వద్ద విషాదం నెలకొంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అప్రమత్తమైన లేక్ పోలీసులు.. యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చెరువులోకి దూకిన యువతి బ్లాక్ కలర్ డ్రెస్ ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆమె వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది.