సంగారెడ్డి : పటాన్చెరు మండలం రుద్రారం శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన భర్తను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం నుంచి మూడేండ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. తల్లి మృతదేహాన్ని, తీవ్ర గాయాలపాలైన తండ్రిని చూస్తూ.. ఆ పాప గుక్కపట్టి ఏడ్చింది. తల్లిదండ్రులను చూసి రోదిస్తున్న చిన్నారిని చూసి స్థానికులు కూడా బోరున ఏడ్చేశారు. తండ్రితో పాటే సంగారెడ్డి ఆస్పత్రికి చిన్నారిని తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.