హైదరాబాద్ : హైదరాబాద్లోని తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సైకిల్పై వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త కూడా పక్కనే ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.