హైదరాబాద్ : నగర పరిధిలోని బోయినపల్లిలో స్థిరాస్తి వ్యాపారి మహమ్మద్ సిద్ధిఖీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యాపారి బార్కస్కు చెందిన ఫైజుద్దీన్ అనే వ్యక్తి హతమార్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా గొడవలు ఉన్నాయని, ఈ క్రమంలో హత్య చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. సిద్ధిఖీ ఇంట్లో ఉండగా.. అక్కడికి వచ్చిన ఫైజుద్దీన్ కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.