Khammam | ఖమ్మం : ఓ తల్లి తన ఇద్దరు కుమారులను తామర చెరువులోకి తోసేసి, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో చోటు చేసుకుంది. ఈ ముగ్గురి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను తల్లి మృదుల, ప్రజ్ఞ(5), మహదేవ్(7) గా పోలీసులు గుర్తించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.