సిద్దిపేట : సిద్దిపేట జిల్లా ములుగు సమీపంలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతుడిని సిద్దిపేటకు చెందిన పవన్(21)గా పోలీసులు గుర్తించారు. సంస్కృతి కాలేజీలో పవన్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. కాలేజీ నుంచి స్వగ్రామమైన సిద్దిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.