ములుగు : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఓ బాలుడు(12) గాలిపటం ఎగురవేస్తుండగా, అది విద్యుత్ స్తంభంపై చిక్కుకుంది. గాలిపటం తీసేందుకు కరెంట్ స్తంభం ఎక్కగా.. బాలుడు విద్యుత్ షాక్తో విలవిలలాడిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
ఈ ఘటనను గమనించిన లైన్మెన్ వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, బాధిత బాలుడికి కిందకు దించాడు. అబ్బాయి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.