Accident | బీహార్ (Bihar)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఆటో రిక్షా (Autorickshaw)ను ఓ ట్రక్కు (Truck) బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్లోని లఖిసరాయ్ (Lakhisarai) జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లఖిసరాయ్ వైపు వెళ్తున్న ఆటోను అతివేంగా వస్తున్న ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఆ సమయంలో ఆటోలో 14 మంది ఉండగా.. తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పాట్నాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Ameen Sayani | దిగ్గజ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ కన్నుమూత
Bharat Jodo Nyay Yatra | రాహుల్ యాత్రకు ఐదు రోజులపాటు బ్రేక్
Virat Kohli | భారత్ హాయిగా నిద్రపోతుంది.. విరుష్క జంటకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఆర్సీబీ