చెన్నై : తమిళనాడులోని తిరుపత్తూర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవధుమలైలో మినీ వ్యాన్ ఎలక్ట్రిక్ పోల్ను ఢీకొని బోల్తా పడటంతో ఏడుగురు మరణించారు.
ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా పది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 26 మంది ప్రయాణీకులున్నారని సమాచారం.