Road Accident | పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన హౌరా జిల్లాలోని బగ్నాన్ వద్ద సోమవారం తెల్లవారు జరిగింది.
ఘటనలో 40 మంది గాయపడ్డారని, అయితే ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. దిఘాకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 70 మంది వరకు ప్రయాణికులున్నారు. అయితే, బస్సు బోల్తాపడడానికి గల కారణాలు తెలియరాలేదు.