కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. సెయింట్ మేరిస్ స్కూల్కు చెందిన బస్సును వ్యాన్ ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పిల్లల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను స్కూల్ నుంచి భీంపూర్ గ్రామానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.