యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో భారీ చోరీ జరిగింది. హోటల్ వ్యాపారి కుకుడాల లక్ష్మారెడ్డి ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న 32 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ. 2.76 లక్షల నగదును దొంగలు అపహరించారు. ఇవాళ ఉదయం ఇంటికొచ్చిన లక్ష్మారెడ్డి తన నివాసంలో చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో బాధిత వ్యక్తి లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.