కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని పిట్లం వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ ముగ్గురు యువకులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతులను సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బొర్గి గ్రామానికి చెందిన పాండురంగ(13), విజయ్(19), సచిన్(20)గా పోలీసులు గుర్తించారు. అయితే మృతుల్లో ఇద్దరు అన్నదమ్ముళ్లు ఉన్నారు. పాండురంగ శంకరంపేటకు టీసీ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముళ్లు చనిపోవడంతో బొర్గి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.