పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం నెలకొంది. రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరి కొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హుస్సేన్మియా వాగు వద్ద ట్రాక్ మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.