మహబూబ్నగర్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి గ్రామ సమీపంలో ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఆలూరు గ్రామానికి చెందిన యాదయ్య, లలిత అనే ఉపాధిహామీ కూలీలతోపాటు డ్రైవర్ విష్ణు మృతిచెందాడు.
వీరు జాతీయ రహదారిపై మొక్కలు నాటేందుకు ట్రాక్టర్పై వెళ్తుండా ప్రమాదం జరిగింది. యాదయ్య, లలిత అక్కడికక్కడే మృతిచెందగా, ట్రాక్టర్ డ్రైవర్ విష్ణుకు తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు. అతడు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు.