హైదరాబాద్ : శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండలో 21.2 కిలోల గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. అయితే పంతులువారి శ్రవణ్ కుమార్(పుప్పాల్గూడ), చొక్కపు దామోదర్ రావు(మణికొండ) కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై 9.2 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక మణికొండకు చెందిన అడం అన్వేష్ వద్ద 10 కిలోలు, జే అభినయ్ వద్ద 2 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ నలుగురు నిందితుల వద్ద ఉన్న మూడు వాహనాలను, మూడు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ కృష్ణకాంత్, ఆనంద్ రావు, మహేశ్, అరుణ్ పాల్గొన్నారు.