హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఈస్ట్ ఆఫ్రికాలోని మాలవి దేశానికి చెందిన ప్రయాణికురాలి వద్ద హెరాయిన్ను గుర్తించిన డీఆర్ఐ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఖతర్ నుంచి వచ్చిన విమానంలో నైరోబి – దోహా మీదుగా ఆమె హైదరాబాద్కు చేరుకుంది. బిజినెస్ వీసా ద్వారా ప్రయాణించిన ఆమె.. 2 పాలిథిన్ కవర్లలో 3.129 కిలోల హెరాయిన్ను తీసుకొచ్చింది. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ. 21.9 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు.. నిందితురాలిని రిమాండ్కు తరలించారు.