హైదరాబాద్ : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.