వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బొంరాస్పేట మండలం తుంకిమెట్ల సమీపంలో జాతీయ రహదారిపై కారు – బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు ప్రయాణిస్తున్న బైక్ నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను మహేశ్(20), నరేశ్(25)గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.