వికారాబాద్ : పూడూరు మండలం చీలాపూర్ శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బీజాపూర్ జాతీయ రహదారిపై ఆటో – బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను మేడికొండకు చెందిన యాదవ్ రెడ్డి, చాకలి రవిగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.