మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ మండల పరిధిలోని అత్వెల్లి సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రేకుల బావి వద్ద 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. ఆటోతో పాటు బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ మహిళతో పాటు బైక్ మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.