హైదరాబాద్ : జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో విషాదం నెలకొంది. సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిన ఓ 17 ఏండ్ల యువతి అదృశ్యమైంది. రాత్రి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే బుధవారం ఉదయం యువతి మృతదేహాన్ని స్థానికంగా నిర్మాణంలో ఉన్న భవనంలో గుర్తించారు. అయితే డెడ్బాడీపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. రక్తపు మడుగులో ఉన్న యువతి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.