అమరావతి, జూలై: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. ఇద్దరు స్నేహితుల మధ్య చిన్నగా మొదలైన గొడవ హత్యకు దారి తీసింది. విచక్షణా రహితంగా జరిగిన కత్తి దాడిలో 16 ఏండ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుంటూరు జిల్లా లోని ముప్పాళ్లకు చెందిన పఠాన్ అఫ్రిద్, షేక్ సుభానీలు స్నేహితులు. బక్రీద్ పండగ సందర్భంగా స్థానికంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. వాలీబాల్ ఆడే సమయంలో వీరిద్దరి మధ్య చిన్నపాటి గోడవ జరిగింది. ఈ విషయాన్ని సుభానీ తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో సుభాని పెదనాన్న షేక్ పెదబాజి అఫ్రిద్తో గొడవపెట్టుకున్నాడు.
రోడ్డుపై వెళుతోన్న అఫ్రిద్తో మాట్లాడుతూ మాట్లాడుతూనే కత్తితో దాడి చేశాడు. దీంతో అఫ్రిద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అఫ్రిద్ను సరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన అఫ్రిద్ చికిత్స పొందుతుండగానే మరణించాడు. అఫ్రిద్ ముప్పాళ్ల హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.