కామారెడ్డి : జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్ర శివారు దర్గా వద్ద ఆర్టీసీ బస్సు ( RTC Bus ) బ్రేకులు ఫెయిలై రోడ్డు దాటుతున్న 15 గొర్రెలు ( Sheeps ) బస్సు కిందపడి మృతి చెందాయి. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన దోకీ లచ్చయ్య గొర్రెలను మేపడానికి తీసుకెళ్తుండగా అన్నారం నుంచి కామారెడ్డి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సంభవించినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రామారెడ్డి పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.