శంషాబాద్ : మూడు వేర్వరు ఘటనల్లో ముగ్గురు మహిళా ప్రయాణీకులు బంగారాన్ని లోదుస్తుల్లో దాచి స్మగ్లింగ్కు విఫలయత్నం చేశారు. ఈ ఘటనలు శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం చోటుచేసుకున్నాయి.
కస్టమ్స్ వివరాల ప్రకారం… దుబాయ్ నుంచి 6ఇ 8422 విమానంలో వచ్చిన మహిళ నుంచి రూ.48.71 లక్షల విలువ చేసే 991 గ్రాముల బంగారం, మరో ఘటనలో దుబాయ్ నుంచి జే9-1403 విమానంలో వచ్చిన మహిళ నుంచి రూ.8.28 లక్షల విలువ చేసే 168.5 గ్రామల బంగారం, 6ఇ 8422 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన మహిళ నుంచి రూ.15.81 విలువ చేసే 321.60 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
లోదుస్తుల్లో బంగారం స్మగ్లింగ్కు యత్నించిన వీరిపై నిఘా పెట్టిన కస్టమ్స్ ముగ్గురి నుంచి రూ. 72.80 లక్షలు విలువ చేసే 148.10 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.