మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ పరిధిలోని దూలపల్లిలో జిల్లా ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోఓ ముగ్గురు వ్యక్తుల నుంచి 14.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న వారిని ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గంజాయిని విద్యార్థులకు, వలస కార్మికులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయితో పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులను పోలీసులు రిమాండ్కు తరలించారు.
గంజాయి నూనెను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను నిన్న ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ముఠా సభ్యుల నుంచి 52 లీటర్ల హాష్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయి నూనె తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.